రాష్ట్రం ఆకాంక్షలను వివరింఛి వాటి మంజూరుకు కృషి చేయాలి : కేసీఆర్.
కొత్త జిల్లాల అభివృద్ధిపై ఎంపీలకు మార్గనిర్దేశనం చేశారు సీఎం కేసీఆర్. కొత్తగా ప్రారంభమైన జిల్లాలకు ప్రాజెక్టులను సాధించేందుకు ఎంపీలు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించి.. వెంటనే వాటిని మంజూరు చేయించాలని సూచించారు. ఎంపీలతో సమావేశమైన ఆయన.. కొత్త జిల్లాల కోసం కేంద్రం నుంచి విద్యాలయాలతో పాటు ఇతర మంజూరుల కోసం ప్రయత్నించాలని, కార్యక్రమాల విస్తరణకు నడుం బిగించాలన్నారు. ప్రధానంగా ఎంపీలు కొత్త జిల్లాలకు రావాల్సిన జాబితాలను తీసుకొని ఈనెల 7, 8, 9 తేదీల్లో సంబంధిత కేంద్రమంత్రులను కలిసి వాటి మంజూరుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈనెల 16 నుంచి పార్లమెంటు సమావేశాల దృష్ట్యా కేంద్రమంత్రులంతా ఢిల్లీలోనే అందుబాటులో ఉంటారని, అందరినీ కలిసి రాష్ట్రం ఆకాంక్షలను వారికి వివరించాలని సూచించారు. ముందుగా ఎంపీలంతా సమావేశమై బాధ్యతలు పంచుకోవాలన్నారు.