మరో స్వర్ణ పతకం
మాస్ న్యూస్ : భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. ఆదివారం నాడు జరిగిన పురుషుల రెజ్లింగ్ 65 కిలోల ఫ్రీసై్టల్ విభాగంలో యోగేశ్వర్ దత్ స్వర్ణ పతకం దక్కింది. తజకిస్తాన్కు చెందిన జలిమ్ఖాన్ యుసుపొవ్పై విజయం సాదించిన యోగేశ్వర్ దత్ భారత పసిడి పతకాల సంఖ్య నాల్గుకు చేర్చాడు. లండన్ ఒలింపిక్సలో రజత పతకం సాధించిన యోగేశ్వర్ ప్రస్తుతం 28 సంవత్సరాల వయస్సులో మరో పతకం సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈ విజయంతో ఆసియా క్రీడల్లోని పతకాల పట్టికలో భారత్ను టాప్-10లోకి తీసుకువచ్చాడు. (ప్రస్తుతం భారత్ 9వ స్థానంలో కొనసాగుతోంది. ఆసియా క్రీడల వేదికపై భారత్కు 28 ఏళ్ల తర్వాత మళ్లీ పతకం దక్కినటై్టంది. రెజ్లింగ్లో ఆఖరి సారి 1986 సియోల్లో జరిగిన ఆసియా గేమ్సలో కర్తర్ సింగ్ భారత్కు పతకం అందించాడు.
Leave a reply
You must be logged in to post a comment.