ఘనంగా’టెంపర్’ చిత్రం ఆడియో వేడుక
మాస్ న్యూస్: ప్రతీసారి ఆడియో వేడుకలో సినిమా చాలా బావుంటుందని చెబుతుంటాం. అయితే నా మటుకు నాకు గత రెండు, మూడు సినిమాల నుంచి అభిమానులను నిరాశ పరిస్తున్నానని అనిపించింది. దేవుడిచ్చిన అభిమానులను ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే అందుకు కారణం తాత ఆశీర్వాదం, అభిమానుల ప్రేమే కారణం. హిట్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా అభిమానులు నచ్చేవరకు సినిమాలు చేస్తూనే ఉంటాను’ అని జూ.ఎన్టీఆర్ అన్నారు.
జూ.ఎన్టీఆర్, కాజల్అగర్వాల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణష్ నిర్మిస్తున్న ‘టెంపర్’ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. వి.వి.వినాయక్ ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి సీడీని నందమూరి కల్యాణ్రామ్కు అందజేశారు. థియేట్రికల్ ట్రైలర్ను పొట్లూరి వి.ప్రసాద్, నరేంద్రచాదరి విడుదలచేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, అందరికీ నచ్చేవిధంగా ఈ సినిమా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ, ఈ ఏడాది నందమూరి నామ సంవత్సరం కావాలంటే అందుకు ప్రేక్షకాభిమానుల అండదండలు ముఖ్యమని అన్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, ‘2004లో ఎన్టీఆర్తో కలసి నేను చేసిన ‘ఆంధ్రావాలా’ అభిమానులతో సహా అందరినీ పెద్దగా నిరాశపరిచింది. మళ్లీ ఆయన కాంబినేషన్లో ఈ చిత్రం చేస్తున్నాను. ఈ పదకొండేళ్లలో ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నింటినీ మరపించేవిధంగా ఈ సినిమా ఉంటుంది. ఇదొక్కటే గుర్తుంటుంది. ఇందులో ఆయన నూతనావతారంలో కనిపిస్తారు. తన అభిమానుల కోసం తగ్గాడు. అదే ఈ రోజు మీరు చూసే సిక్స్ప్యాక్. ఇందులోని ఓ సన్నివేశం కోసం పద్దెనిమిది గంటలు వాటర్ కూడా తాగకుండా నటించాడు. మొదటి సినిమా చేస్తున్నట్లుగా ఎంతో తపనతో చేశాడు’ అని చెప్పారు. కల్యాణ్రామ్ మాట్లాడుతూ, ‘పటాస్ మూడు అక్షరాలే. అలాగే లయన్, టెంపర్’ కూడా మూడు అక్షరాలె’ అన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. నిర్మాత బండ్ల గణష్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నామని అన్నారు. నందమూరి అభిమానులు కాలర్ ఎత్తుకుని గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందన్నారు.
Leave a reply
You must be logged in to post a comment.