కేసీఆర్కు దమ్ముంటే మంత్రులపై చర్య తీసుకోవాలి
— January 30, 2015మాస్ న్యూస్: మంజీరా నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల్లో మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డిల పాత్ర ఉందని అక్కడి రైతులు బహిరంగంగా చెబుతున్నారు. అవినీతిపరుల తాట తీస్తానని హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే ఆ ఇద్దరు మంత్రులపై చర్య తీసుకోవాలి’’ అని తెలంగాణ టీడీపీ డిమాండ్ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని తెలిపింది. గురువారం హైదరాబాద్లో ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘అవినీతికి పాల్పడినందుకే ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేశానంటున్న ముఖ్యమంత్రి… మంత్రులు హరీశ్, పోచారంపైనా అదే చర్య తీసుకోవాలి. దళితుడైన రాజయ్యపై ఎంత వేగంగా చర్యలు తీసుకున్నారో ఈ మంత్రులపై కూడా అంతేవేగంగా చర్యలు తీసుకోవాలి. గనుల శాఖను చూస్తున్న హరీశ్ బంధువులు, నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు కలిసి మంజీరా నదిలో ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని […]
Continue Reading ...