కలసి పోటీ చేద్దాం ! ఎవరిబలమేందో తేలిపోతుంది
మాస్ న్యూస్: మధ్యంతర ఎన్నికలు వస్తాయంటున్న టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు దమ్ముంటే నాపై పోటీ చేసేందుకు నీవు రాజీనామా చెయ్యి నేను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తాను ఇద్దరం కలిసి పోటీచేస్తే ఎవరి బలమేందో ప్రజలే నిర్ణయిస్తార ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దయాకర్రావు పదేపదే పరకాలకు మధ్యంతర ఎన్నిక తప్పదంటూ మాట్లాడడం ఆయన అవి వేకానికి నిదర్శనమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తొత్తుగా మారిన ఆయన తనను విమర్శించే అర్హత లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీలో ఉండి పోరాటం చేసిన తనకు తెలంగాణ ప్రజలు గుర్తించి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నేత కేసీఆరేనని కొనియాడారు. ఇప్పటికైనా ఎర్రబెల్లి తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరాలని హితవు పలికారు.
Leave a reply
You must be logged in to post a comment.