ఛార్మి టైటిల్ పాత్రలోజ్యోతిలక్ష్మి
మాస్ న్యూస్: ఛార్మి టైటిల్ పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందబోయే ‘జ్యోతిలక్ష్మి’ చిత్రం ఈ నెల 20న ప్రారంభం కానుంది. సి.కె.ఎంటర్టైన్మెంట్, శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకాలపై శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు దీనిని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పూరి జగన్నాథ్ తెలియజేస్తూ, వుమెన్ సెంట్రిక్ చిత్రమిదని అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ, ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే వరుణ్తేజ్ హీరోగా మరో చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఛార్మి, సత్య, వంశీ ప్రధాన పాత్రలలో నటించే ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.జి.వింద, సంగీతం: సునీల్కశ్యప్.
Tagged with:
actress Allari naresh bollywood charmi cherry chiranjeevi festivals of telangana filim news gopi chand heroins hindi actress main role massnews movie jythilakshmi Rajamouli samantaa telugu filims telugu films Telugu stars tollywood
Leave a reply
You must be logged in to post a comment.