Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
  • నయనతార పెళ్లి ?

    మాస్ న్యూస్:  నయనతార మొన్నటీ వరకూ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అంతకుముందు శింభుతో లవ్‌స్టోరి నడిపింది ఈ అమ్మడు. వీరిద్దరితో ఎఫైర్‌ చెడిన తర్వాత నయనతార అందరికి దూరంగా ఉంటోంది. తాజాగా టాలీవుడ్‌లో మరో వార్త వినబడుతోంది. ఓ ప్రముఖ తమిళ దర్శకుడ్ని నయనతార పెళ్లిచేసుకోబోతుందనే వార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మరి ఆ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే…వారిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వక తప్పదు. సినీ ప్రముఖుల మీద ఇలాంటి వార్తలు నిత్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. వీటిలో నిజాలు ఎంత ఉన్నాయోనని అభిమానులు గందరగోళంలో పడతారు. ఏది ఏమైనా నయనతార నిత్యం వార్తల్లో నిలవడం అలవాటుగా మార్చుకుంది.

    Continue Reading ...
  • దగ్గుబాటి రామానాయుడు ఇక లేరు

    మాస్ న్యూస్: తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సహా 13 భారతీయ భాషల్లో 140 చిత్రాలు నిర్మించి.. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్‌ రికార్డు సాధించిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. మూవీ మొఘల్‌.. దగ్గుబాటి రామానాయుడు(79) ఇక లేరు! కొంతకాలంగా ప్రొస్టేట్‌కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు సురేశ్‌, వెంకటేశ్‌, కుమార్తె లక్ష్మి ఉన్నారు. ప్రజల సందర్శనార్థం గురువారం ఉదయం ఆయన పార్థివ దేహాన్ని రామానాయుడు స్టూడియోస్‌లో ఉంచి, మధాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని రామానాయుడు కుమారుడు వెంకటేశ్‌ తెలిపారు.

    Continue Reading ...
  • డీ-గ్లామరస్‌ క్యారెక్టర్లయినా..ok..

    మాస్ న్యూస్:   తెలుగులో అగ్రతార హోదాను ఆస్వాదిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ప్రభాస్‌తో ‘బాహుబలి’, రవితేజతో ‘బెంగాల్‌ టైగర్‌’ సినిమాలు చేస్తోంది. ‘బాహుబలి’లో అవంతిక పాత్రలో మెరుపుతీగలా ఆమె మెరిసిపోతోందని అందరూ అంటున్నారు. ఇప్పటివరకూ ‘100ు లవ్‌’ సినిమాలో చేసిన మహాలక్ష్మి పాత్ర తనకు బాగా సంతృప్తినిచ్చిందనీ, నటిగా తనను ఎస్టాబ్లిష్‌ చేసుకోవడానికి ఆ పాత్ర అవకాశమిచ్చిందనీ చెప్పే తమన్నా, గ్లామరస్‌ క్యారెక్టర్లయినా, డీ-గ్లామరస్‌ క్యారెక్టర్లయినా స్ర్కిప్ట్‌ నచ్చితే చేయడానికి సిద్ధమంటోంది. ‘‘ఇప్పటివరకూ నేను రెండు రకాల పాత్రలు చేశాను. మంచి స్ర్కిప్ట్‌లో నాది డీ-గ్లామరస్‌ క్యారెక్టరైనా చేయడానికి వెనుకాడను. గతంలో ‘ఊసరవెల్లి’లో సెకండాఫ్‌లో డీ-గ్లామరస్‌గా ఉండే పాత్ర చేశాను కదా’’ అని చెప్పింది తమన్నా. ప్రస్తుతం ఆమె ‘బాహుబలి’ షూటింగ్‌లో ఉంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన అందమైన సెట్‌లో ప్రభాస్‌, తమన్నాపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలోని అవంతిక పాత్రలో తన అందచందాలు, నటన ప్రేక్షకులను […]

    Continue Reading ...
  • హాట్‌ బ్యూటీ మధురిమ ఐటం సాంగ్

    మాస్ న్యూస్: హీరోయిన్‌‌గా సక్సెస్‌‌ కావాలంటే కేవలం గ్లామర్‌ మాత్రమే ఉంటే సరిపోదు. అందుకు అదృష్టం కూడా తోడవ్వాలి… అది కొరవడడంతోనే కాబోలు… హాట్‌ బ్యూటీ మధురిమ… తెలుగులో అరడజనుకు పైగా సినిమాల్లో నటించినప్పటికీ.. కాలం కలిసి రాలేదు…. కైపెక్కించే అందచందాలు ఉన్నప్పటికీ హీరోయిన్‌‌గా సక్సెస్‌ కాలేకపోయిన ఈ బ్యూటీ ‘కొత్తజంట’ మూవీతో ఐటంగర్ల్‌‌గానూ ట్రై చేసింది…. అలా ఓ వైపు ఐటం సాంగ్ లు… మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ కెరీర్ కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో ఐటం సాంగ్ చేరబోతోందట.

    Continue Reading ...
  • ఛార్మి టైటిల్‌ పాత్రలోజ్యోతిలక్ష్మి

    మాస్ న్యూస్: ఛార్మి టైటిల్‌ పాత్రలో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందబోయే ‘జ్యోతిలక్ష్మి’ చిత్రం ఈ నెల 20న ప్రారంభం కానుంది. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ శుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు దీనిని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పూరి జగన్నాథ్‌ తెలియజేస్తూ, వుమెన్‌ సెంట్రిక్‌ చిత్రమిదని అన్నారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ, ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలోనే వరుణ్‌తేజ్‌ హీరోగా మరో చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఛార్మి, సత్య, వంశీ ప్రధాన పాత్రలలో నటించే ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.జి.వింద, సంగీతం: సునీల్‌కశ్యప్‌.

    Continue Reading ...
  • మహేష్ బాబుతో సన్నీ స్పెషల్ సాంగ్

    మాస్ న్యూస్:టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సన్నీ స్పెషల్ సాంగ్ చేయబోతోంది అనే వార్తలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శ్రుతిహాసన్ లు జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా యూనిట్ పోలాచ్చి నుంచి తిరిగి వచ్చిన తరువాత సన్నీలియోన్ తో ఒక స్పెషల్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారని టాక్. ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన సెట్ ను హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో డిజైన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు ఉన్న ప్రాధాన్యత రీత్యా ఈసారి సన్నీతో మహేష్ స్టెప్స్ వేస్తే ఈ సినిమాకు బయ్యర్లలో మరింత క్రేజ్ పెరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నారు అని తెలుస్తోంది. అయితే ‘కరెంట్ తీగ’ సినిమాలో సన్నీ స్పెషల్ సాంగ్ […]

    Continue Reading ...
  • ఘనంగా’టెంపర్‌’ చిత్రం ఆడియో వేడుక

    మాస్ న్యూస్: ప్రతీసారి ఆడియో వేడుకలో సినిమా చాలా బావుంటుందని చెబుతుంటాం. అయితే నా మటుకు నాకు గత రెండు, మూడు సినిమాల నుంచి అభిమానులను నిరాశ పరిస్తున్నానని అనిపించింది. దేవుడిచ్చిన అభిమానులను ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే అందుకు కారణం తాత ఆశీర్వాదం, అభిమానుల ప్రేమే కారణం. హిట్‌, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా అభిమానులు నచ్చేవరకు సినిమాలు చేస్తూనే ఉంటాను’ అని జూ.ఎన్టీఆర్‌ అన్నారు. జూ.ఎన్టీఆర్‌, కాజల్‌అగర్వాల్‌ జంటగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బండ్ల గణష్‌ నిర్మిస్తున్న ‘టెంపర్‌’ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. వి.వి.వినాయక్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి సీడీని నందమూరి కల్యాణ్‌రామ్‌కు అందజేశారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను పొట్లూరి వి.ప్రసాద్‌, నరేంద్రచాదరి విడుదలచేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, అందరికీ నచ్చేవిధంగా ఈ సినిమా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ, ఈ ఏడాది నందమూరి నామ సంవత్సరం […]

    Continue Reading ...
  • హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మృతి

    మాస్ న్యూస్: హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మృతిపై సినీ హీరోలు బాలకృష్ణ, మోహన్ బాబులు స్పందించారు. సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లకుండా ఉండివుంటే నారాయణను మలేరియా కబళించేది కాదని వారిద్దరు అభిప్రాయపడ్డారు.ఇదే అంశంపై వారు వేర్వేరుగా మాట్లాడుతూ… నారాయణ అద్భుతమైన నటుడు. ఆయన నాకు మంచి మిత్రుడు. పలు సినిమాల్లో కలిసి చేసాం. ఆయన మృతి చెందారన్న వార్త మనసును కలిచి వేసింది. ఈ మధ్య కూడా ‘లయన్’లో కలిసి నటించాం. అలాంటి గొప్ప నటుడిని పరిశ్రమ కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. అలాగే, ఎంఎస్ మరణంపై మోహన్ బాబు స్పందిస్తూ… మా సినిమా ‘ఎం.ధర్మరాజు ఎంఏ’తో నటుడిగా పరిశ్రమకు పరిచయమయ్యారు. నాతోనూ, నా బిడ్డలతోనూ నటించడానికి ఎంతో ఆసక్తి కనపరిచేవారు. ఏ రోజూ నాకు ఇంత పారితోషికం కావాలని నోరు తెరిచి […]

    Continue Reading ...
  • సెన్సార్ బోర్డు సభ్యురాలిగా జీవిత..

    మాస్ న్యూస్: ప్రముఖ నటి, బీజేపీ నేత జీవిత రాజశేఖర్‌ను సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిపై ఆమె స్పందిస్తూ తన పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని చెప్పారు. ఇరవై ఏళ్లుగా సినీ రంగంలోనే ఉన్నానని… అదే రంగానికి చెందిన పదవి దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. బీజేపీ రాజకీయ నేపథ్యంలోనే పదవి దక్కిందన్న కామెంట్లను కొట్టిపారేశారు. అసలు తాము పదవుల కోసం బీజేపీలో చేరలేదని… సమాజానికి సేవ చేయాలనే చేరామని జీవిత చెప్పారు. ప్రతి విషయాన్ని విమర్శించే వారు అన్నిచోట్ల ఉంటార అన్నారు. అయితే అలాగే ప్రతి విషయాన్ని పట్టించుకుంటే ముందుకు సాగలేమని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కేంద్రం సెన్సార్ బోర్డులో 9 మంది నూతన సభ్యులను నియమించింది. బాలీవుడ్ సీనియర్ దర్శకనిర్మాత పహ్లాజ్ నిహలాని కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జీవితతో పాటు ఎస్.శేఖర్, జార్జ్ బేకర్, మిహిర్ భూటా, […]

    Continue Reading ...
  • డిల్లీ సుందరి సురభి జాక్ పాట్

    మాస్ న్యూస్:  ‘బీరువా’ చిత్రం తో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన డిల్లీ సుందరి సురభి జాక్ పాట్ కొట్టింది. ఈ సినిమా తర్వాత సురభి ఏ సినిమాకి సైన్ చేయలేదు. ప్రస్తుతం దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నహై వోల్టేజ్ మల్టీస్టారర్ లో హీరోయిన్ గా నటించే సువర్ణావకాశాన్ని సురభి సొంతం చేసుకొంది. తెలుగులో ‘సిటిజన్, రఘువరన్ బీటెక్’ పేర్లతో అనువాదమైన తమిళ చిత్రాల్లో నటించిన సురభి- ‘బీరువా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. మంచు మనోజ్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్, మంజు భార్గవి తదితర హేమాహేమీలు నటిస్తున్న ‘ఎటాక్’ (వర్కింగ్ టైటిల్)లో హీరోయిన్ గా ఎంపికవ్వడం ద్వారా అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్న సురభి దియేటర్ ఆర్ట్స్ చేసి, మోడలింగ్ ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది.

    Continue Reading ...
  • రామ్‌ గోపాల్‌వర్మ గొలుసు

    మాస్ న్యూస్: రామ్‌ గోపాల్‌వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మనోజ్‌, జగపతిబాబు కాంబినేషన్‌ని మరోసారి చూడవచ్చు. ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా జగపతిబాబు నటిస్తున్నారు. వర్మ ప్రస్తుతం మంచు కుటుంబంతో బిజీగా ఉన్నారు. మంచు లక్ష్మీ, విష్ణు, మోహన్‌బాబులతో చిత్రాలు తీసిన వర్మ మనోజ్‌తో కూడా సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘గొలుసు’ అనే టైటిల్‌ను పెడుతునట్లు సమాచారం. వర్మ దర్శకత్వంలో పనిచేసిన అనుభవం ‘గాయం’తో జగపతిబాబుకి ఉంది. ప్రస్తుతం జగపతిబాబు సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో వర్మ ఉన్నట్లు తెలుస్తోంది.

    Continue Reading ...
  • నాగచైతన్య హీరోగా దోచేయ్‌

    మాస్ న్యూస్:   నాగచైతన్య హీరోగా కృతి సనన్‌ హీరోయిన్‌గా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రానికి ‘దోచేయ్‌’ అనే పేరు ఖాయం చేశారు. రిలయన్స్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. పతాకంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా చిత్రం లోగోని విడుదల చేసిన అనంతరం నిర్మాత మాట్లాడుతూ ‘మా బేనరులో ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత ‘స్వామి రారా’ చిత్రం టెక్నీషియన్లతో నిర్మిస్తున్న చిత్రం ఇది. నూటికి నూరు శాతం కథకి తగిన టైటిల్‌ ఇది. సుధీర్‌వర్మ చాలా బాగా సినిమాని రూపొందిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రం పూర్తయింది. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి చివరి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. నాగచైతన్య కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ మూవీగా ఈ చిత్రం నిలుస్తుంది’ అన్నారు.  బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., […]

    Continue Reading ...
  • చాలాకాలం తర్వాత త్రిష సినిమా

    మాస్ న్యూస్ : చాలాకాలం తర్వాత త్రిష కమర్షియల్‌ సినిమాలను, హాఫ్‌బీట్‌ చిత్రాలను బేలన్స్‌ చేసుకుంటూ చేస్తుంది. తాజాగా తమిళంలో జై పక్కన నటించే చిత్రానికి సంతకం చేసింది. తిరు దర్శకత్వం వహించే ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి రానుంది. విలేజీ బేస్డ్‌ క్యారెక్టర్‌ నుంచి మెచ్యూర్డ్‌ వరకు ఎదిగే పాత్ర ఆమెకెంతో నచ్చిందట.గతంలో స్వామి చిత్రంలో ఆమె అటువంటి తరహా పాత్ర పోషించింది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఎం. నాథన్‌ కెమెరా చేస్తున్నారు. కుంబకోణం నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది. అక్కడికి చెందిన అమ్మాయిగా త్రిష కన్పించనుంది. మార్చిలో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

    Continue Reading ...
  • కుర్రాళ్ళతో డేటింగ్ చేసిన అక్షర.

    మాస్ న్యూస్: మూడు పదులకు చేరువైన శ్రుతి హాసన్ ఆరేళ్ళ క్రితం ‘లక్కీ’మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి… తొలి సినిమాలోనే అందాలను నిరభ్యంతరంగా ఆరబోసింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇక్కడా గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంది. అంతేకాదు… అతి తక్కువ సమయంలో సత్తాను చాటి… స్టార్ డాటర్స్ సైతం శృంగార నాయికలుగా రాణించగలరని తెలియచేసింది. బహుశా అక్కలోని ఈ డేరింగ్ నెసే అక్షరకూ నచ్చినట్టుంది! హీరోయిన్ కాకముందే… ఫిల్మ్ ఫీల్డ్ కు చెందిన కుర్రాళ్ళతో డేటింగ్ చేసిన అక్షర… అనేక విషయాల్లో తన ప్రత్యేకత చాటుకుంది.యాక్టింగ్ ను కెరీర్ గా తీసుకున్నతర్వాత ఊహించని విధంగా ఇండివిడ్యువాలిటీని ప్రదర్శిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. సెలబ్రిటీస్ లో అత్యధిక టాటూస్ ఉన్నది అక్షరకే నట. ఆమె శరీరంలోని వివిధ భాగాల్లో మొత్తం తొమ్మిది టాటూస్ ఉన్నాయట! అంతేకాదు… జుత్తుకు పెర్పుల్ కలర్ వేసుకుని… కొంగొత్తగా కనిపించిన అక్షర ఈ మధ్యే మళ్ళీ నేచురల్ […]

    Continue Reading ...
  • లేడీస్ అండ్ జెంటిల్ మెన్

    మాస్ న్యూస్:’స్నేహగీతం’ సినిమాతో దర్శకుడిగా మారిన మధుర శ్రీధర్ గత యేడాది ‘మాయ’ మూవీతో ప్రొడ్యూసర్ అయ్యారు. అయితే ఆ సినిమా ఆయన్ని నిరాశకు గురిచేసింది. కాగా తన మిత్రులతో కలిసి శ్రీధర్ నిర్మించిన తాజా చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ విజయాన్ని సాధించింది. ‘స్నేహగీతం’ తర్వాత దక్కిన సక్సెస్ ఇదేనని శ్రీధర్ చెబుతున్నారు. సోషల్ మీడియా యువతపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కుటుంబ సభ్యుల మధ్య అది ఎలాంటి దూరాన్ని పెంచుతోంది? అనే అంశాన్నే ఇందులో ప్రధానంగా చర్చించారు. ఇది విషాదాంతమైన చిత్రమే అయినా… ప్రేక్షకులు కథతో కనెక్ట్ అయి ఆదరించడం ఆనందంగా ఉందంటున్నారు శ్రీధర్. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందే బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేశ్ భట్ ‘ఇది బోల్డ్ అటెమ్ట్’ అంటూ ప్రశంసలు అందించడం విశేషం.

    Continue Reading ...
  • బాహుబలి సన్నివేశాలు యూట్యూబ్‌లో హల్‌చల్‌

    మాస్ న్యూస్:ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చిత్రిస్తున్న బాహుబలి చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తన డ్రీమ్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఒక్క లీకు బయటకు పొక్కకుండా రాజమౌలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. పలు విజువల్స్‌ బయటకు పొక్కడంపై సినిమా యూనిట్‌ సీరియస్‌గా ఉంది. రూ.170 కోట్ల బడ్జెట్‌తో.. అన్ని భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ఓ వైపు సినిమా యూనిట్‌ సన్నద్ధమవుతుండగా.. ఇలా కొన్ని సన్నివేశాలు బహిర్గతమవ్వడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో.. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఆగంతుకుడిపై చిత్రయూనిట్‌ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ వ్యవహారం వెనక సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఒక ఉద్యోగి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అయితే.. షూటింగ్‌ విషయమై అంతర్గత కలహాలతో ఈ వీడియో లీకవ్వలేదని.. ఆలోచనారహితంగా సదరు ఉద్యోగి చేసిన పొరపాటు ఇది అని కేసు దర్యాప్తు […]

    Continue Reading ...
  • ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో రాశిఖన్నా

    మాస్ న్యూస్: తెలుగు చిత్రసీమలో వరుస ఆఫర్లతో బిజీ బీజీగా ఉన్న బ్యూటీ రాశిఖన్నా. ఇటీవల ఈ అమ్మడు నటించిన ‘ఊహలు గుసగుస లాడే’ చిత్రం హిట్టు కొట్టడంతో ఈ ముద్దుగుమ్మను టాలీవుడ్ ఆఫర్లు ఆవహించాయి. ఇప్పటికే గోపీచంద్ సరసన ‘జిల్’ సినిమాలో నటిస్తోన్న ఈ బ్యూటీ మరో వైపు రవితేజతో కూడా నటిచేందుకు సిద్ధమైంది.రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటించనుంది. ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా రామ్ సరసన కూడా నటించే ఛాన్స్‌ను పొందింది. నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి రూపొందించే ‘శివం’ సినిమాలో రాశి ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. అదేవిధంగా ఇంకొన్ని ఆఫర్లు కూడా చర్చల దశలో ఉన్నట్టు సినీ వర్గాల సమాచారం. 2015 సంవత్సరం ఈ అమ్మడుకి లక్కీగా ఉన్నట్టుంది.

    Continue Reading ...
  • ఒక్కడితో …మొదలైంది

    మాస్ న్యూస్:  మోహన్‌, మైనా, నరేశ్‌, లావణ్య, శరత్‌, అనూష హీరోహీరోయిన్లుగా మొగిలి నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఒక్కడితో’. ‘మొదలైంది’ అనేది ఉపశీర్షిక. బైలుపాటి మోహన్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బి.మోహన్‌ నిర్మిస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మోహన్‌ మాట్లాడుతూ ‘‘చక్కని కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. సుమన్‌, ధనరాజ్‌ పాత్రలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. అలాగే తెరపై కనిపించే ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. అనుకున్న సమయంలో షూటింగ్‌ పూర్తి చేశాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.నవీన్‌రాజ్‌ కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు సినిమాకు వెన్నెముకలాంటివి. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: బోలే, కెమెరా:శ్యామ్‌ ప్రసాద్‌ దూపటి.

    Continue Reading ...
  • ప్రేమ వివాహమే చేసుకుంటా!

    మాస్ న్యూస్: సాధారణంగా ఏ హీరోయిన్ అయినా ప్రేమ విషయంలో కాస్త రహస్యాన్ని దాచడం జరిగేదే. ఒకవేళ ఎవరైనా మీది ప్రేమ వివాహమా అని అంటే, వెంటనే నో.. నో.. అని చెప్పడం మనకు తెలిసిందే. అయితే, లక్ష్మీమీనన్ ముద్దుగుమ్మ మాత్రం తాను ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని బల్లగుద్ది మరీ చెబుతోంది. తమిళంలో హీరోయిన్‌గా కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆమధ్య హీరో విశాల్‌తో ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపించాయి. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని ఆమె చెబుతుండడంతో వీరిద్దరిమధ్య కోలీవుడ్ మీడియా ఓ కన్నుకూడా వేసిందట. చివరికి చెప్పినమాట చేస్తుందో లేక తూచ్ అంటుందో చూద్దాం!

    Continue Reading ...