డిల్లీ సుందరి సురభి జాక్ పాట్
— February 27, 2015మాస్ న్యూస్: ‘బీరువా’ చిత్రం తో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన డిల్లీ సుందరి సురభి జాక్ పాట్ కొట్టింది. ఈ సినిమా తర్వాత సురభి ఏ సినిమాకి సైన్ చేయలేదు. ప్రస్తుతం దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నహై వోల్టేజ్ మల్టీస్టారర్ లో హీరోయిన్ గా నటించే సువర్ణావకాశాన్ని సురభి సొంతం చేసుకొంది. తెలుగులో ‘సిటిజన్, రఘువరన్ బీటెక్’ పేర్లతో అనువాదమైన తమిళ చిత్రాల్లో నటించిన సురభి- ‘బీరువా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. మంచు మనోజ్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్, మంజు భార్గవి తదితర హేమాహేమీలు నటిస్తున్న ‘ఎటాక్’ (వర్కింగ్ టైటిల్)లో హీరోయిన్ గా ఎంపికవ్వడం ద్వారా అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్న సురభి దియేటర్ ఆర్ట్స్ చేసి, మోడలింగ్ ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది.
Continue Reading ...