నాగచైతన్య హీరోగా దోచేయ్
మాస్ న్యూస్: నాగచైతన్య హీరోగా కృతి సనన్ హీరోయిన్గా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రానికి ‘దోచేయ్’ అనే పేరు ఖాయం చేశారు. రిలయన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. పతాకంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా చిత్రం లోగోని విడుదల చేసిన అనంతరం నిర్మాత మాట్లాడుతూ ‘మా బేనరులో ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత ‘స్వామి రారా’ చిత్రం టెక్నీషియన్లతో నిర్మిస్తున్న చిత్రం ఇది. నూటికి నూరు శాతం కథకి తగిన టైటిల్ ఇది. సుధీర్వర్మ చాలా బాగా సినిమాని రూపొందిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రం పూర్తయింది. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి చివరి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. నాగచైతన్య కెరీర్లో మరో బ్లాక్బస్టర్ మూవీగా ఈ చిత్రం నిలుస్తుంది’ అన్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., ఫొటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సహ నిర్మాత: భోగవల్లి ప్రసాద్.
Leave a reply
You must be logged in to post a comment.