Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
అర్హులైన వారికి మాత్రమే కోవాక్సిన్ 2వ డోస్

అర్హులైన వారికి మాత్రమే కోవాక్సిన్ 2వ డోస్

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

మాస్ న్యూస్ : సోమవారం (17.05.2021) రోజు భద్రాద్రి జిల్లాలో కోవాక్సిన్ వాక్సినేషన్ సెషన్ నిర్వహించబడుతుంది.

  •  కోవాక్సిన్ 2వ డోస్ కోసం అర్హులైన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. మొదటి డోస్ ఎవరికి కోవాక్సిన్ ఇవ్వబడదు
  • కోవాక్సిన్ 2వ డోస్ కోసం అర్హులైన వారు మొదటి డోస్ సర్టిఫికెట్ లేదా ఫోన్ మెసేజ్ తో మరియు  ఆధార్ కార్డ్ తో మీకు దగ్గరలోని ఏదయినా ప్రభుత్వ వాక్సిన్ కేంద్రానికి వెళ్లి ఈ టీకా తీసుకోవచ్చు.
  • తేదీ: 18.05.2021 నుండి యధావిధిగా కోవిషీల్డ్ టీకా అన్ని ప్రభుత్వ వాక్సిన్ కేంద్రాలలో  అర్హులైన 2వ డోస్ వారికి ఇవ్వబడును.

కోవిడ్ వాక్సిన్ పై కొన్ని ముఖ్య సూచనలు:

  • కోవిడ్ వ్యాధి పోసిటివ్ వచ్చిన వారు, వ్యాధినుండి పూర్తిగా కోలుకున్న తర్వాత కనీసం 2 నెలల  వ్యవధి తర్వాత కోవిడ్ టీకా తీసుకోవచ్చు.
  • ఒకవేళ మొదటి డోస్ తీసుకున్న తర్వాత కోవిడ్ వ్యాధి నిర్దారణ అయితే వారు కూడా పూర్తిగా కోలుకున్న తరువాత  కనీసం 2 నెలల వ్యవధి తరువాత కోవిడ్ టీకా తీసుకోవచ్చు.
  • కోవిడ్ టీకా తీసుకున్న వారిలో ఒకటి లేదా రెండు రోజులు జ్వరం, ఒళ్లునొప్పులు ,తలనొప్పి ,నీరసం లాంటి లక్షణాలు ఉండవచ్చు. టాబ్లెట్ పారాసెటమాల్ ను డాక్టర్/ నర్స్ సూచన మేరకు ఉపయోగించవచ్చు. ఒకవేళ 3 రోజులకు పైగా లక్షణాలు తగ్గనట్లయితే తప్పనిసరిగా దగ్గర్లోని ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్త ను సంప్రదించాలి.

కోవిడ్ వాక్సిన్ కేంద్రాలకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలి అని డా.నాగేంద్ర ప్రసాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి భద్రాద్రి కొత్తగూడెం  తెలిపారు.

Related Articles

Leave a reply

You must be logged in to post a comment.