అర్హులైన వారికి మాత్రమే కోవాక్సిన్ 2వ డోస్
మాస్ న్యూస్ : సోమవారం (17.05.2021) రోజు భద్రాద్రి జిల్లాలో కోవాక్సిన్ వాక్సినేషన్ సెషన్ నిర్వహించబడుతుంది.
- కోవాక్సిన్ 2వ డోస్ కోసం అర్హులైన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. మొదటి డోస్ ఎవరికి కోవాక్సిన్ ఇవ్వబడదు
- కోవాక్సిన్ 2వ డోస్ కోసం అర్హులైన వారు మొదటి డోస్ సర్టిఫికెట్ లేదా ఫోన్ మెసేజ్ తో మరియు ఆధార్ కార్డ్ తో మీకు దగ్గరలోని ఏదయినా ప్రభుత్వ వాక్సిన్ కేంద్రానికి వెళ్లి ఈ టీకా తీసుకోవచ్చు.
- తేదీ: 18.05.2021 నుండి యధావిధిగా కోవిషీల్డ్ టీకా అన్ని ప్రభుత్వ వాక్సిన్ కేంద్రాలలో అర్హులైన 2వ డోస్ వారికి ఇవ్వబడును.
కోవిడ్ వాక్సిన్ పై కొన్ని ముఖ్య సూచనలు:
- కోవిడ్ వ్యాధి పోసిటివ్ వచ్చిన వారు, వ్యాధినుండి పూర్తిగా కోలుకున్న తర్వాత కనీసం 2 నెలల వ్యవధి తర్వాత కోవిడ్ టీకా తీసుకోవచ్చు.
- ఒకవేళ మొదటి డోస్ తీసుకున్న తర్వాత కోవిడ్ వ్యాధి నిర్దారణ అయితే వారు కూడా పూర్తిగా కోలుకున్న తరువాత కనీసం 2 నెలల వ్యవధి తరువాత కోవిడ్ టీకా తీసుకోవచ్చు.
- కోవిడ్ టీకా తీసుకున్న వారిలో ఒకటి లేదా రెండు రోజులు జ్వరం, ఒళ్లునొప్పులు ,తలనొప్పి ,నీరసం లాంటి లక్షణాలు ఉండవచ్చు. టాబ్లెట్ పారాసెటమాల్ ను డాక్టర్/ నర్స్ సూచన మేరకు ఉపయోగించవచ్చు. ఒకవేళ 3 రోజులకు పైగా లక్షణాలు తగ్గనట్లయితే తప్పనిసరిగా దగ్గర్లోని ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్త ను సంప్రదించాలి.
కోవిడ్ వాక్సిన్ కేంద్రాలకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలి అని డా.నాగేంద్ర ప్రసాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి భద్రాద్రి కొత్తగూడెం తెలిపారు.
Tagged with:
Bhadradri Kothagudem district news Laxmidevipally Laxmidevipally news mass news online mass news tv Online telugu news telangana news TELUGU NEWS village mass news
Leave a reply
You must be logged in to post a comment.