భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలు
మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. బుధవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలంతా ముందు జాగ్రత్తగా నిత్యవసర వస్తువులను మంగళవారం కొనుగోలు చేశారు. దీంతో ఆ రోజు మార్కెట్ మొత్తం రద్దీగా కనబడింది. లాక్ డౌన్ లో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండడంతో కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం మాత్రమే ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చారు. కొత్తగూడెం డి.ఎస్.పి వెంకటేష్ బాబు నేతృత్వంలో ఆయా సర్కిల్ ఇన్స్పెక్టర్ లు వారి వారి పరిధిలో లాక్ డౌన్ అమలకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ప్రధాన రహదారుల వెంబడి బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు రోడ్లపై తిరగకుండా చర్యలు చేపట్టారు. సబ్ ఇన్స్పెక్టర్లు ఆయా ఏరియాలలో వాహనాలపై పెట్రోలింగ్ చేస్తూ ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఎవరు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.
Leave a reply
You must be logged in to post a comment.